బుచ్చయ్య పేట: నేతావానిపాలెంలో ఆపారిశుధ్యంపై డిపిఓ ఆగ్రహం

72చూసినవారు
బుచ్చయ్య పేట: నేతావానిపాలెంలో ఆపారిశుధ్యంపై డిపిఓ ఆగ్రహం
బుచ్చయ్యపేట మండలం నేతవానిపాలెంలో శనివారం ఉదయం డిపిఓ ఆర్.శిరీషా రాణి స్వయంగా పారిశుద్ధ్య పనులు చేపట్టారు. కేబీ రోడ్డు నుండి అంగన్వాడీ కేంద్రానికి వెళ్లే రహదారిలో చెత్తకుప్పల పేరుకుపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె స్వయంగా చీపురు పట్టి చెత్తాచెదారాలను తొలగించారు. ప్రతి శనివారం అధికారులు గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు. రోడ్డు పక్క బహిరంగ మల విసర్జనపై కూడా ఆగ్రహించారు.

సంబంధిత పోస్ట్