అనంతపురం రూరల్ పంచాయతీకి చెందిన పలువురు యువకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి సమక్షంలో ఆయన స్వగృహం వద్ద వైసీపీ కండువాలు వేసుకున్నారు. కొత్తగా ఓటర్లుగా మారిన తాము రానున్న ఎన్నికల్లో వైసీపీకే ఓటు వేస్తామని యువకులు తెలిపారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలన బాగుందని, అనంతపురంలో అభివృద్ధి బాగా జరుగుతోందన్నారు.