అనంతపురంలో జనసేన కార్యకర్తల ఆత్మీయ సమావేశం

59చూసినవారు
అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో జనసేన నాయకులు, వీర మహిళలు, జనసేన కార్యకర్తల ఆత్మీయ సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి, భవాని రవికుమార్, పెండ్యాల శ్రీలత ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉమ్మడి అనంతపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి వెంకట ప్రసాద్ హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్