ఉరవకొండ ఎస్ఐ రాఘవేంద్రప్ప ఆధ్వర్యంలో కేంద్ర సాయుధ బలగాలతో కలిసి సోమవారం మండలంలోని సమస్యాత్మక గ్రామం రాకెట్లలో ఉదయం ఫ్లాగ్ మార్చ్, గ్రామసభలు నిర్వహించారు. గ్రామ ప్రజలతో ఎస్సై మాట్లాడారు. ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ నిర్వహించడమే లక్ష్యంగా సంకల్పించామన్నారు. కౌంటింగ్ రోజున, ఆ తరువాత రోజుల్లో కూడా ఎలాంటి గొడవలకు పాల్పడవద్దన్నారు.