ఉరవకొండలో జరుగుతున్న ఎన్నికల అక్రమాలపై టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఎన్నికల అధికారికి శనివారం ఫిర్యాదు చేసారు. మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాత పాత డేట్ వేసి, డిప్యూటీ తహశీల్దార్ సంతకంతో మ్యానువల్ ఇంటి పట్టాలు పంపిణీ చేస్తున్నారన్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడిన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జిల్లా ఎన్నికల అధికారిని కోరినట్లు ఆయన వెల్లడించారు.