ఉరవకొండ మండలం పెద్ద కౌకుంట్ల గ్రామంలోని శ్రీ కటువ ఆంజనేయ స్వామి ఆలయంలో బుధవారం భారీ చోరీ జరిగింది. స్వామివారికి సంబంధించిన 30 తులాల వెండి ఆభరణాలు, రూ. 10 వేలు నగదును గుర్తుతెలియని దుండగులు అపహరించారు. విషయాన్ని పోలీసులకు ఆలయ అర్చకులు తెలిపారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగల ఆనవాళ్లను సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.