వడ్డీ వ్యాపారస్తులపై చర్యలు తీసుకోవాలి: దళిత జేఏసీ

67చూసినవారు
వడ్డీ వ్యాపారస్తులపై చర్యలు తీసుకోవాలి: దళిత జేఏసీ
పేదలను జలగళ్లా పట్టి పీడిస్తున్న వడ్డీ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి పేర్కొన్నారు. బుధవారం అధిక వడ్డీ వ్యాపారుల బారిన పడి ఆత్మహత్య చేసుకున్న దళిత రాముడు మృతదేహాన్ని అనంతపురం ఆస్పత్రిలో సందర్శించి సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అధిక వడ్డీ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్