ప్రజలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్థలాలను కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ మంగళవారం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రజలను మభ్య పెట్టి మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ప్రజలు వాళ్ల ట్రాప్లో పడి కొనుగోలు చేయొద్దని కోరారు. మోసపోయిన వారు ఎవరైనా ఉంటే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయలని కోరారు.