అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల చరిత్ర విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ శశాంక్ మౌళి ముఖ్య అతిథిగా హాజరై దేశ ఆర్థిక వ్యవస్థలో పర్యాటకం చాలా కీలకపాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. భారతదేశం ఘనమైన వారసత్వ కలిగిన దేశమని, ఎందరో విదేశీయులు భారతదేశ పర్యటనకు వస్తారన్నారు.