ధర్మవరంలో బుధవారం రాత్రి ఓ గూడ్స్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. కొందరు గుర్తుతెలియని దుండగులు రైల్వే స్టేషన్ కు సమీపంలో రైల్వే ట్రాక్ పై ఇనప స్తంభాన్ని అడ్డుగా పెట్టారు. దూరం నుంచే గమనించిన లోకో పైలెట్ వెంటనే గూడ్స్ రైలును ఆపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనపై రైల్వే యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.