రోడ్డు ప్రమాదంలో మహిళా టీచర్ కు గాయాలు

69చూసినవారు
గుత్తి పట్టణ శివారులోని అనంతపురం రోడ్డులో మాసినేని పాఠశాల వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. శాంత కుమారి అనే టీచర్ బైక్ పై పామిడి నుంచి గుత్తికి బయలుదేరారు. మార్గ మధ్యలో వెనక నుంచి బైక్ ను ఆర్టీసీ బస్సు ఢీకొంది. ప్రమాదంలో శాంతకుమారి గాయపడ్డారు. స్థానికులు గమనించి గుత్తి ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం రెఫర్ చేశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్