అడ్డు గోడలను తొలగించండి: సిపిఎం

61చూసినవారు
అడ్డు గోడలను తొలగించండి: సిపిఎం
గుంతకల్లు పట్టణంలోని వివిధ కాలనీలు, రైల్వే సరిహద్దులలో రహదారులు మధ్య నిర్మించిన అడ్డు గోడలతో ప్రజలు, విద్యార్థులు, రైల్వే ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం డిఆర్ఎం కార్యాలయానికి వెళ్లి ఏడిఆర్ఎం సుధాకర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. రైల్వే సరిహద్దుల్లో నిర్మించిన అడ్డు గోడలు తొలగించాలని సిపిఎం నాయకులు బి. శ్రీనివాసులు, దాసరి శ్రీనివాసులు తదితరులు కోరారు.

సంబంధిత పోస్ట్