ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు పై న్యాయవాదుల హర్షం

85చూసినవారు
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు పై న్యాయవాదుల హర్షం
రైతులను నట్టేట ముంచేందుకు తీసుకొచ్చిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దుచేయడం ఎంతో అభినందనీయమని న్యాయవాదులు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దుపై సంతకం చేయడంపై న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. టీడీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు శివశంకర్ ఆధ్వర్యంలో శుక్రవారం హిందూపురం పట్టణంలోని కోర్టువద్ద న్యాయవాదులు మిఠాయి పంచుకొని అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీగా వెళ్లారు.

సంబంధిత పోస్ట్