కదిరి పట్టణంలో బుధవారం 6, 8వ వార్డులో సచివాలయం సిబ్బంది ఇంటిపన్ను సాకుతో వాలంటీర్లను పిలుచుకొని ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని టీడీపీ నాయకులు వాపోయారు. వార్డు సచివాలయం కార్యదర్శి ఈశ్వర్ రెడ్డి, నాగవేణి సిబ్బంది కలిసి ఓటర్లని భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. సిబ్బంది పైనా చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారులకు 6, 8వ వార్డు టీడీపీ నాయకులు విజ్ఞప్తి చేశారు.