కళ్యాణదుర్గం: బాలికోన్నత పాఠశాల ముందు అంతా బురదమయం

67చూసినవారు
కళ్యాణదుర్గం: బాలికోన్నత పాఠశాల ముందు అంతా బురదమయం
కళ్యాణదుర్గం పట్టణంలో గత కొన్ని రోజులగా కురుస్తున్న వర్షాలకు రహదారులన్నీ బురదమయంగా మారడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టణంలోని బాలికోన్నత పాఠశాల వద్ద సోమవారం రాత్రి కురిసిన వర్షానికి పాఠశాల ముందు భాగమంతా బురద మయంగా మారడంతో విద్యార్థులు పాఠశాలలోకి వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం వచ్చిందంటే చాలు పాఠశాల ముందు వర్షపు నీరు, బురదతో నిండిపోతుందన్నారు.

సంబంధిత పోస్ట్