కళ్యాణదుర్గం: ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన ఆర్డీవో

52చూసినవారు
కళ్యాణదుర్గం: ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన ఆర్డీవో
కళ్యాణదుర్గం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా అసిస్టెంట్ కలెక్టర్, ఇన్ చార్జి ఆర్డీవో బి. వినూత్న ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆమె ఆసుపత్రిలోని అన్ని గదులను, రిజిస్టర్లను, ఆసుపత్రి పరిసరాలను పరిశీంచారు. రోగులతో మాట్లాడుతూ వసతులు, వైద్య సదుపాయం, డాక్టర్ల పని వేళలు మొదలైన అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడుతూ రోగులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సరైన వైద్యం అందించాలన్నారు.

సంబంధిత పోస్ట్