ముళ్లపొదల్లో పశుసంవర్ధక శాఖ రైతు శిక్షణ విస్తరణ కేంద్రం

58చూసినవారు
ముళ్లపొదల్లో పశుసంవర్ధక శాఖ రైతు శిక్షణ విస్తరణ కేంద్రం
లక్షలు వెచ్చించి నిర్మించిన పశుసంవర్ధక శాఖ రైతు శిక్షణ విస్తరణ కేంద్రం ముళ్లపొదలతో నిండిపోయిందని మంగళవారం రైతులు విలేఖరులకు తెలిపారు. కళ్యాణదుర్గంలో రైతులకు శిక్షణిచ్చేందుకు నిర్మించిన భవనం ప్రస్తుతం అధ్వానంగా తయారైంది. 2016 అప్పటి ఎమ్మెల్యే ఉన్నం నాబార్డు నిధులుకింద 60లక్షలు వెచ్చించి నిర్మాణాన్ని చేపట్టారు. పనులు పూర్తికాకుండానే నిర్మాణం ఆగిపోయింది. భవనాన్ని ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్