శ్రీసత్యసాయి జిల్లా మడకశిర టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచిన ఎమ్మెస్ రాజు సోమవారం హైదరాబాద్ లో సినీ హీరో నారా రోహిత్ ని కలిశారు. నారా రోహిత్ మాట్లాడుతూ మడకశిరలో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెస్ రాజును గెలిపించడంతో ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. నారా రోహిత్ తో పాటు సప్తగిరి, సంతోష్ ఉన్నారు.