శ్రీసత్య సాయి జిల్లా రొల్ల మండలం కొత్తపాలెం గ్రామంలో గురువారం వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఈర లక్కప్ప ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ అభ్యర్థి బోయి శాంతమ్మ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలకు ఏ కష్టం రావద్దు అని పేదలకు సంక్షేమ పథకాలు అందించి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నాయకత్వానికి నిర్వచనం సీఎం జగన్ మోహన్ రెడ్డి అని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీని గెలిపించాలని కోరారు.