ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి

50చూసినవారు
ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి
సోమందేపల్లిలో ఆటో కార్మికులతో బుధవారం ఆటో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెడపల్లి బాబా సమావేశం నిర్వహించారు. అనంతరం అయన మాట్లాడుతూ ఆటో కార్మికులపై ఆర్టీఓ, పోలీసులు వేధింపులు ఆపాలని, ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్, మండల నాయకులు రాజగోపాల్, చేనేత కార్మిక సంఘం నాయకులు నారాయణస్వామి, చాంద్ బాషా, గంగరాజు, బాబు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్