సోమందేపల్లి లో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు ... పట్టించుకోని రెవెన్యూ అధికారులు

1273చూసినవారు
సోమందేపల్లి లో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు ... పట్టించుకోని రెవెన్యూ అధికారులు
అనంతపురం జిల్లా మండల కేంద్రమైన సోమందేపల్లి లో ఆదివారం రోజు సెలవు రోజు కావడంతో అక్రమ నిర్మాణాలు చేసుకునే వారికి అచ్చొచ్చిన రోజుగా అభివర్ణించచ్చు . ఆదివారం మరియు సెలవు రోజుల్లో అధికారులు ఉండరు కాబట్టి అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా తమ పనులు చేసుకుంటూ పోతున్నారు. ప్రతి ఆదివారం ఒక్కొక్క నిర్మాణం జరుగుతూనే ఉంది. దీనిని ఆపే నాథుడే కరువయ్యాడని ప్రజలు విమర్శిస్తున్నారు. సామాజిక మాధ్యమ గ్రూపుల్లో సైతం వైరల్ అవుతున్న ఫోటోలను చూసి కూడా అధికారులు ఎందుకు పట్టించుకోలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచి అక్రమ నిర్మాణాలను ఆపాలని సోమందేపల్లి మండల ప్రజలు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్