సీసీ రోడ్డును ప్రారంభించిన మంత్రి సవితమ్మ

70చూసినవారు
సీసీ రోడ్డును ప్రారంభించిన మంత్రి సవితమ్మ
గోరంట్ల పట్టణంలోని శివాలయం కాలనీలో తెలుగుదేశం పార్టీ నాయకులు వెంకటరామప్ప తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే సొంత నిధులతో సిసి రోడ్డు నిర్మిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం గత నెల క్రితం మంత్రి సవితమ్మ చేతుల మీదుగా భూమి పూజ చేశారు. అదే విధంగా సీసీ రోడ్డు పూర్తి కాగా రోడ్డును ఆదివారం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ ప్రారభించారు. ఈ సందర్భంగా మంత్రి సవితమ్మ వెంకటరామప్పను అభినందించారు.

సంబంధిత పోస్ట్