6వ రోజు కూడా కొనసాగిన బందోబస్తు

2891చూసినవారు
6వ రోజు కూడా కొనసాగిన బందోబస్తు
సోమందేపల్లి మండల కేంద్రంలో మార్చిలో ఇవ్వబోవు ఇళ్ల పట్టాలకు సంబంధించి భూమి చదును చేసే కార్యక్రమానికి ఆరవ రోజైన మంగళవారం సైతం పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ మేరకు గత వారం భూమిని చదును చేసే కార్యక్రమంలో ఆ భూమికి చెందిన రైతులు ధర్నా చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గత కొన్ని రోజుల నుంచి నేటి వరకు పోలీసు బందోబస్తు నడుమ జెసిబిలతో భూమిని చదును చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆరవ రోజైన మంగళవారం కూడా సోమందేపల్లి, పెనుగొండ ఎస్సైలు, పోలీసుల మధ్య భూమి చదును కార్యక్రమం కొనసాగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్