ఇసుక సరఫరాను సరళతరం చేయండి

682చూసినవారు
ఇసుక సరఫరాను సరళతరం చేయండి
సోమందేపల్లి మండల కేంద్రంలో ఇసుక సమస్యతో చాలా ఇబ్బందులు పడుతున్నామని ఆ సమస్యలు వెంటనే పరిష్కరించాలని గ్రామానికి చెందిన టీవీ విలేఖరి జగదీష్ పంచాయతీ కార్యదర్శి అంజనప్ప కుసోమవారం వినతి పత్రం అందజేశారు.. ఈ సందర్భంగా జగదీష్ పంచాయతీ అధికారులతో మాట్లాడుతూ... గ్రామంలో ఇసుక కోసం ఆన్లైన్లో అనుమతులు కావాలని కోరుకుంటే అక్కడ సోమందేపల్లె చెరువులో ఇసుక ఉన్నట్లు చూపుతుందని తెలిపారు. అయితే సోమందేపల్లి చెరువులో ఇసుక లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తాము నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణంలో పనులు నిలిచి పోతున్నాయని అన్నారు . అందువలన అధికారులు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లే ఈ సమస్యను పరిష్కరించాలని ఆయన కోరారు. ఆన్లైన్లో అనుమతులు ఇచ్చిన రెండు గంటల లోపలే ఇసుక తోలు కోవాలని నిబంధనలు ఉన్నాయని వాటిని సడలించి మరింత సమయం కేటాయించాలన్నారు. ఈ సమస్యలు పరిష్కరించకపోతే ఇళ్ల నిర్మాణాలు చేపట్టే యజమానులు కార్మికులు చాలా ఇబ్బందులు పడతారని ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్