డ్వాక్రా సంఘం నుండి తొలిగించారని ఆత్మహత్య

2711చూసినవారు
డ్వాక్రా సంఘం నుండి తొలిగించారని ఆత్మహత్య
అనంతపురం జిల్లా గోరంట్లలోని ఆర్.కే టాకీస్ సమీపంలో మంగళవారం పద్మ అనే మహిళ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 20 సంవత్సరాల నుండి డ్వాక్రా సంఘం లీడరుగా ఉన్న పద్మను మిగతా సభ్యులు సంఘం నుండి తనకు తెలియకుండా లీడరుగా తీసేశారు. ప్రతి అధికారికి తన సమస్యను చెప్పినా కూడా ఎవరు పట్టించుకోకపోవడంతో తీవ్ర మనస్థాపంతో డ్వాక్రా లీడర్ పద్మ ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు బంధువులు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్