వరద బాధితులకు ఆహారం సిద్ధం చేస్తున్న సత్యసాయి జిల్లా వాసులు

67చూసినవారు
భారీ వర్షాలు, వరదలు కారణంగా తీవ్రంగా నష్టపోయిన విజయవాడ వాసులకు బుధవారం ఉదయం సత్య సాయి జిల్లా ఉద్యోగులు ఆహారం సిద్ధం చేసి అందచేస్తున్నారు. విజయవాడలోని సత్యనారాయణపురంలో సత్యసాయి జిల్లాకు చెందిన పలువురు ఉద్యోగులు అక్కడికి తరలి వెళ్లి ఆహారం సిద్ధం చేస్తూ పంపిణి చేస్తున్నారు. జిల్లాలోని వివిధ శాఖల నుంచి పలువురు ఉద్యోగులు విజయవాడకు తరలి వెళ్ళినట్టు జిల్లా అధికారులు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్