నార్పల పంచాయతీ వేలం పాట ఈనెల 19కి వాయిదా వేసినట్లు శుక్రవారం పంచాయతీ కార్యదర్శి అశ్వత్త నాయుడు తెలిపారు. నార్పల గ్రామ పంచాయతీకి సంబంధించిన ఆదాయ ప్రతిఫల మిచ్చు వ్యాపారాలు అంటే, బస్టాండు, వారపుసంత, మూత్రశాలలు, మరుగుదొడ్లుకు శుక్రవారం ఉదయం 11 గంటలకు నిర్వహించు బహిరంగ వేలాలు, ఒక వారం రోజులు పాటు వాయిదా వేయాలని కోరడం జరిగింది. తెలుగుదేశం నాయకులు ఆకుల బాబు వినతిపత్రం సమర్పించారు.