సీజనల్ వ్యాధుల పై అవగాహన కల్పించిన సర్పంచ్ రామాంజనేయులు

56చూసినవారు
సీజనల్ వ్యాధుల పై అవగాహన కల్పించిన సర్పంచ్ రామాంజనేయులు
నార్పల మండలం శిద్ధరాచర్ల గ్రామపంచాయతీ గ్రామ సచివాలయం నందు మంగళవారం ఎంఎల్హెచ్పి, ఆశ వర్కర్లు, అంగన్వాడి టీచర్లు, క్లాఫ్ మిత్రాలు, సచివాలయ సిబ్బందితో సర్పంచ్ సాకే రామాంజనేయులు సమావేశం ఏర్పాటు చేసి సీజనల్ వ్యాధులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సీజన్లో వచ్చే డయేరియా మరియు దోమల ద్వారా వచ్చే డెంగ్యూ, మలేరియా వ్యాధుల నివారణకు ముఖ్యంగా ఇంటిదగ్గర పరిసర ప్రాంతాలలో మురుగునీరు లేకుండా చేసుకోవడం వంటి జాగ్రత్తలను ప్రతి ఇంటికి వెళ్లి తెలియజేయాలని సిబ్బందికి తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సాకేకుల్లాయప్ప, అమృతాంజలి, సచివాలయ సిబ్బంది, అంగన్వాడి కార్యకర్తలు, ఆశా వర్కర్లు, క్లాఫ్ మిత్రాలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్