సింగనమలలో ఇసుక డంపు స్వాధీనం

83చూసినవారు
సింగనమలలో ఇసుక డంపు స్వాధీనం
సింగనమల మండలం పెరవలి సమీపంలో ఇసుక డంపును స్వాధీనం చేసుకొన్నట్లు సీఐ కౌలుట్లయ్య తెలిపారు. ఆ ప్రాంత ప్రజల సమాచారం మేరకు ఇసుక అక్రమ రవాణాను అడ్డుకొన్నట్లు వివరించారు. ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్, ఇటాచీని స్వాధీనం చేసుకొన్నట్లు తెలిపారు. అక్రమంగా ఇసుకను తరలించేందుకు సిద్ధంగా ఉన్న వాహనాలతో పాటు ఇసుకను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు వివరించారు.

సంబంధిత పోస్ట్