గూడ్స్ రైలు ఢీకొని వృద్ధుడికి గాయాలు

79చూసినవారు
గూడ్స్ రైలు ఢీకొని వృద్ధుడికి గాయాలు
తాడిపత్రి పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం గూడ్సు రైలు ఢీకొని ఓ వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డాడు. రైల్వే ఎస్సై నాగప్ప తెలిపిన వివరాల మేరకు రాజంపేటకు చెందిన యల్లయ్య తాడి పత్రి రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాల వద్ద మూత్రవిసర్జన చేస్తుండగా గూడ్స్ రైలు ఢీకొంది. ఈ ప్రమాదంలో అతని చేతికి గాయమైంది. బాధితుడిని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు.

సంబంధిత పోస్ట్