చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి: సీఐ

56చూసినవారు
చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి: సీఐ
ఇంటర్ విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని పట్టణ సీఐ సాయి ప్రసాద్ సూచించారు. శుక్రవారం తాడిపత్రి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం చాలా మంది విద్యార్థులు చిన్నవయస్సులోనే మత్తు పదార్థాలకు బానిసలై జీవితాలను బుగ్గిపాలు చేసుకుంటున్నారన్నారు. మద్యం, గంజాయి వంటి వాటికి విద్యార్థులు దూరంగా ఉండాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్