పెద్దపప్పూరు మండలంలోని అశ్వత్థ నారాయణస్వామి క్షేత్ర సమీపంలోని పెన్నానది ఒడ్డున రూ. 80 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన కాశిరెడ్డి నాయన, శివాలయం ప్రతిష్ట కార్యక్రమాలు సోమవారం ప్రారంభించారు. వేదపండితులు తొలిరోజు శాంతిపూజలు, హోమం చేశారు. మంగళవారం సాయంత్రం కాశిరెడ్డినాయన, శివ లింగాలను గార్లదిన్నె ఊరేగించి బుధవారం తెల్లవారుజామున ప్రతిష్ట చేయనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.