తాడిపత్రి నియోజకవర్గం టిడిపి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకు వెళ్తున్నారు. పట్టణంలోని మారుతి నగర్, సంజీవ్ నగర్, కాలనీలలో ఆయన మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ మేరకు ఆయా కాలనీలలో ఆయన పర్యటిస్తూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ బాబు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వారికి వివరించారు. అనంతరం టిడిపికి ఓటు వేసి గెలిపించాలని జేసీ అస్మిత్ రెడ్డి కోరారు.