పెద్దపప్పూరు మండలంలో వ్యవసాయ అధికారులు పంటకోత ప్రయోగాలు చేపట్టారు. మండల పరిధిలోని చిక్కేపల్లి గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఎస్బిఐ ఇన్సూరెన్స్ అధికారులతో కలిసి విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ రంగనాయకులు క్షేత్ర స్థాయిలోకి వెళ్లి పంటకోత ప్రయోగాలు చేపట్టారు. రైతు అంకిరెడ్డి పొలంలో 2. 720 గ్రాములు దిగుబడి వచ్చినట్లు అధికారులు నిర్ధారించారు. నివేదికలను ఉన్నతాధికారులను పంపడం జరుగుతుందన్నారు.