తాడిపత్రిలో భారీగా నగదు స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్

30784చూసినవారు
తాడిపత్రి బస్టాండ్ దగ్గర షేక్ మస్తాన్ వలీ అనే బంగారు వ్యాపారి వద్ద రూ. కోటి 31 లక్షల 35, 750 నగదు పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి దగ్గర ఆధారాలు లేకపోవడంతో స్థానిక పోలీసులు నగదు స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్ట్ చేశామన్నారు. నగదును సీజ్ చేసి ఐటీ శాఖకు అప్పగించామన్నారు. సోమవారం విలేకరుల సమావేశంలో పట్టుబడిన నగదు గురించి వివరాలను తాడిపత్రిలో అడిషనల్ ఎస్పీ రామకృష్ణ వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్