తాడిపత్రిలో దొంగల హల్చల్

68చూసినవారు
తాడిపత్రిలో దొంగలు వరుస చోరీలకు పాల్పడుతూ హల్చల్ చేస్తున్నారు. శనివారం పట్టణంలోని పుట్లూరు రోడ్డులో పలు దుకాణాల్లో దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. పుట్లూరు రోడ్డులోని ఆయిల్ దుకాణం, కిరాణాకొట్టు, మెడికల్ స్టోర్కు సంబంధించిన షట్టర్లు పగుల గొట్టి అందులో ఉన్న రూ. 50 వేలు నగదు దోచుకెళ్లినట్లు ఎస్సై గౌస్ బాషా తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఆయా పరిసరాల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్