పెన్నహోబిలంలో వైభవంగా 'ధ్వజారోహణ' కార్యక్రమం

75చూసినవారు
పెన్నహోబిలంలో వైభవంగా 'ధ్వజారోహణ' కార్యక్రమం
ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న ఉరవకొండ మండలం పెన్నహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మంగళవారం ఉదయం 'ధ్వజారోహణ' కార్యక్రమాన్ని వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా అర్చకులు ప్రధాన ఆలయంలోని స్వామివారి మూల విరాట్‌కు, ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఈఓ విజయ్, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్