ఉరవకొండ: వాగులో చిక్కుకు పోయిన ఆరుగురు కూలీలు

76చూసినవారు
ఉరవకొండ: వాగులో చిక్కుకు పోయిన ఆరుగురు కూలీలు
పెద్దవడుగూరు మండలంలో శనివారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి మండలంలోని పి. వీరన్నపల్లి సమీపంలో పుల్లేటి, పందుల వాగులు పోటెత్తాయి. చిత్రచేడు గ్రామానికి రాము తన ట్రాక్టర్ కు పంట నూర్పిడి యంత్రం తగిలించుకుని 6మంది కూలీలతో వెళ్తుండగా, పుల్లేటి వాగులో ట్రాక్టర్ ఇరుక్కొంది. గ్రామస్తుల సమాచారంతో తహసీల్దార్ ఉషారాణి, ఎస్ఐ చిన్నరెడ్డప్ప కూలీలకు ఎలాంటి ప్రాణహాని కలగకుండా జేసీబీ సాయంతో రక్షించారు.

సంబంధిత పోస్ట్