ఉరవకొండ: ఎంపీడీవోకు సన్మానం చేసిన సర్పంచుల భేటీ

67చూసినవారు
ఉరవకొండ: ఎంపీడీవోకు సన్మానం చేసిన సర్పంచుల భేటీ
ఉరవకొండ నూతన ఎంపీడీవో రవి ప్రసాద్ ను మండలంలోని పలువురు సర్పంచులు మంగళవారం భేటీ అయ్యారు. రవి ప్రసాద్ కు పూలమాలలు వేసి, శాలువలు కప్పి సన్మానించారు. గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపాలని అన్నారు. మౌలిక సదుపాయాలు కల్పించడంలో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా సీనియర్ నాయకులు వ్యాసాపురం సర్పంచ్ సీతారాములు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్