గంజాయి అమ్ముతున్న ముగ్గురు నిందితుల అరెస్టు

565చూసినవారు
కడప జిల్లా పోరుమామిళ్లలోని రంపాడు రోడ్డులో గంజాయి అమ్ముతున్న ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రెండున్నర కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సర్కిల్ ఇన్ స్పెక్టర్ డి. శ్రీనివాసులు, ఎస్ఐ కొండారెడ్డి తెలిపారు. సోమవారం సాయంత్రం విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ ఆ ముగ్గురు వద్ద నుంచి 2575 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వారిని రిమాండ్ కు పంపడం జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్