కడప ఎంఎస్ఎంఈ.ని తరలించవద్దు: డివైఎఫ్ఐ

53చూసినవారు
కడప ఎంఎస్ఎంఈ.ని తరలించవద్దు: డివైఎఫ్ఐ
జమ్మలమడుగులోని పాత బస్టాండ్ గాంధీ విగ్రహం వద్ద గురువారం డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శివకుమార్ మాట్లాడుతూ.. కడప జిల్లాలోని కొప్పర్తి మేఘ ఇండస్ట్రియల్ హబ్ అనుసంధానంగా మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ టెక్నాలజీ, టెస్టింగ్ సెంటర్ ను కేంద్ర ప్రభుత్వం ఇస్తే, దానిని రాష్ట్ర ప్రభుత్వం క్యాపిటల్ డెవలప్మెంట్ అథారిటీ అమరావతికి తరలించడం దారుణమన్నారు. తక్షణమే జీవో నెంబర్ 56 రద్దు చేసి ఎంఎస్ఎమ్ఈ టెక్నికల్ సెంటర్ ను తరలింపు ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వం మానుకోవాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్