రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

77చూసినవారు
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
కమలాపురం మండలం పందిళ్ళ పల్లె గ్రామ సమీపాన బుధవారం కారు, ఆటో ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను 108లో కడప రిమ్స్ కు తరలించినట్టు సమాచారం. మృతుడు కడపకు చెందిన షేక్ అబ్దుల్ హసన్ (23)గా గుర్తించారు. చిలమకూరకు చెందిన కారు, కడపకు చెందిన ఆటోగా గుర్తించారు పోలీసులు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్