ఫైనాన్స్ సొమ్ముతో ఉడాయించిన వ్యక్తి అరెస్ట్

75చూసినవారు
ఫైనాన్స్ సొమ్ముతో ఉడాయించిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు మదనపల్లె తాలూకా సీఐ శేఖర్ తెలిపారు. మదనపల్లె పట్టణం దేవత నగర్ లోని ఓ రిజిస్టర్డ్ ఫైనాన్స్ కంపెనీ అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తున్న తమిళనాడు రాష్ట్రం, కరూరు చిన్నముక్కంబాడికి చెందిన రామచంద్ర ఫైనాన్సు డబ్బు రూ. 7లక్షలు కాజేసినట్లు తెలిపారు. అసిస్టెంట్ మేనేజర్ కార్తీక్ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేపట్టి, నిందితుని బసినికొండలో అరెస్టు చేశామన్నారు.

సంబంధిత పోస్ట్