మహిళలందరూ లక్షాధికారులు కావాలి

80చూసినవారు
మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించడానికి ప్రభుత్వం మహిళా సాధికారిత దిశగా అడుగులు వేస్తోందని ఎమ్మెల్యే షాజహాన్ బాష పేర్కొన్నారు. మండలకేంద్రంలోని శ్రీశక్తి భవనంలో ఆదివారం ఏర్పాటు చేసిన మహిళా సమాఖ్య సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళల ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడానికి రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసిన ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ కార్యకర్తలు, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్