మైదుకూరు ఎంపీడీఓగా బాధ్యతలు చేపట్టిన శ్రీధర్ నాయుడు

85చూసినవారు
మైదుకూరు ఎంపీడీఓగా బాధ్యతలు చేపట్టిన శ్రీధర్ నాయుడు
మైదుకూరు మండల నూతన అభివృద్ధి అధికారిగా కె. వి శ్రీధర్ నాయుడు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈయన చాపాడు మండల అభివృద్ధి అధికారిగా పనిచేస్తూ సాధారణ బదిలీలలో భాగంగా మైదుకూరు ఎంపీడీఓ గా బాధ్యతలు చేపట్టారు. మైదుకూరు ఇన్ చార్జీ ఎంపీడీఓ గా ఏఓ లక్ష్మి దేవి విధులు నిర్వహిస్తూ ప్రస్తుతం బదిలీపై వెళ్లారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ మండల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్