స్వర్ణాంధ్ర వ్యాసరచన పోటీలో విద్యార్థినికి ప్రథమ స్థానం

69చూసినవారు
స్వర్ణాంధ్ర వ్యాసరచన పోటీలో విద్యార్థినికి ప్రథమ స్థానం
కడప జిల్లా మైదుకూరు వనిపెంట ఎం. జే. పి ఏపీ బీసీ వెల్ఫేర్ బాలికల పాఠశాల విద్యార్థిని "సన" స్వర్ణాంధ్ర వ్యాసరచన పోటీలో జిల్లా స్థాయిలో ప్రథమ స్థానాన్ని సాధించి, రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైంది. జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకుంది. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ వి. నిర్మల విద్యార్థిని సనను అభినందించారు.

సంబంధిత పోస్ట్