వాగు పొంగి పొర్లడంతో నిలిచిపోయిన వాహనాలు

54చూసినవారు
బ్రహ్మంగారిమఠం మండలంలోని సోమిరెడ్డి పల్లె గ్రామం వద్ద వున్న వాగు బుధవారం ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ ప్రవాహం వలన బ్రహ్మంగారిమఠం- బద్వేలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి ఈ వాగు పొంగిపొర్లుతుంది. ఈ రహదారిలో ప్రయాణిస్తున్న వాహనాలు, ఆర్టీసీ బస్సు సహితం నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులకు లోనవుతున్నారు. ఈ వాగుపై బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్తులు, ప్రయాణికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్