ఆకట్టుకున్న అర్జున తపస్సు కార్యక్రమం

58చూసినవారు
పీలేరు ఆర్టీసి ప్రాంగణంలో పంచమ వేద మహాభారత యజ్ఞంలో భాగంగా శుక్రవారం జరిగిన అర్జున తపస్సు కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది. ముందుగా తపస్సుమానుకు పూజ చేసి, అర్జున వేషధారి శివనామ స్మరణ చేస్తూ, ఒక్కో మెట్టు పైకి ఎక్కాడు. చివరగా తపస్మానుపై తపస్సు చేసి, అక్కడి నుంచి భక్తులపైకి పుష్ప, ఫలాదులను విసరడం జరిగింది. కొందరు మహిళా భక్తులు వరపడి మొక్కులు మొక్కారు. ఇందులో మహాభారత యజ్ఞం కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్