మహిళల భద్రతపై అవగాహన

50చూసినవారు
మహిళల భద్రతపై అవగాహన
వేంపల్లె ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సైబర్ నేరాలు, మహిళల భద్రత, ఆన్లైన్ మోసాలు, డ్రగ్స్, సూసైడ్ నివారణ, ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. మంగళవారం ఏర్పాటు చేసిన సదస్సులో సీఐ ఏ. సురేష్ రెడ్డి హజరై మాట్లాడారు. ప్రలోభాలకు, ఆకర్షణలకు గురై బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దన్నారు. ఉన్నత లక్ష్యాలతో చదివి గురువులకు, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలన్నారు, వీటి బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు.

సంబంధిత పోస్ట్