రాబోయే రోజుల్లో స్వయంగా నేనే ప్రతి పల్లె కు వచ్చి గ్రామ ప్రజలతో కలిసి సమస్యలను తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కారం చేస్తామని రైల్వే కోడూరు నియోజకవర్గ టిడిపి బాధ్యులు ముక్కా రూపానంద రెడ్డి అన్నారు. కూటమి కార్యకర్తలు, నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ సమస్య ఉన్నా నాకు తెలియజేయండి వెంటనే పరిష్కరిస్తానని కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు భరోసా ఇచ్చారు.